Skip to main content

APSSDC: దాల్మియా భారత్‌ ఫౌండేషన్‌తో ఏపీఎస్‌ ఎస్‌డీసీ ఒప్పందం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి దాల్మియా భారత్‌ ఫౌండేషన్‌ ముందుకువచ్చింది.
APSSDC
దాల్మియా భారత్‌ ఫౌండేషన్‌తో ఏపీఎస్‌ ఎస్‌డీసీ ఒప్పందం

వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో క్యాపిటల్‌ గూడ్స్, నిర్మాణ రంగం, ఐటీఈఎస్, హెల్త్‌కేర్‌ రంగాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు దాల్మియా భారత్‌ ఫౌండేషన్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

చదవండి: APSSDC: ‘నైపుణ్యం’లో ముందడుగు.. స్కిల్‌ కాలేజీలు ఏర్పాటు..

నవంబర్‌ 23న ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దాల్మియా భారత్‌ గ్రూప్‌ సీఎస్‌ఆర్‌ కంట్రీ హెడ్‌ డా.అరవింద్‌ మధుకర్‌ బోధన్‌కర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో సత్యనారాయణ ఒప్పందపత్రాలను మార్చుకున్నారు. 

చదవండి: APSSDC: ఏపీఎస్‌ఎస్‌డీసీకి జాతీయ గుర్తింపు.. ఎందుకంటే?

Published date : 24 Nov 2022 03:40PM

Photo Stories