పాలిటెక్నిక్లలో సీట్లకు దరఖాస్తులు
Sakshi Education
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రి పాలిటెక్నిక్, విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ప్రైవేటు పాలిటెక్నిక్లలో సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్టు రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులోని మూడు డిప్లొమా కోర్సుల్ని ఆంగ్ల మీడియంలోనే బోధిస్తారని పేర్కొన్నారు. రెండేళ్ల వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం డిప్లొ మా కోర్సులు, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రి కల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఆయన వివరించారు. విద్యా ర్థులు పాలిసెట్–2022కు ఆగస్టు 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొత్తం సీట్లలో 60 శాతం గ్రామీణ ప్రాంతంలో చదివిన వారితో, 40 శాతం సీట్లు పాలిసెట్ ర్యాంకర్ల ప్రతిభ ఆధారంగా భర్తీ చేయనున్నట్టు వివరించారు. కౌన్సెలింగ్ తేదీల ను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. అభ్యర్థులు సీట్ల వివరాలు, కేటాయింపు, పాలిటెక్నిక్ల వివ రాల సమగ్ర సమాచారం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.pjtrau.edu.in ను చూడాలని సూచించారు.
చదవండి:
Published date : 27 Jul 2022 03:31PM