రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్తగా 247 పీజీ వైద్య విద్య సీట్లు రానున్నాయి.
రాష్ట్రానికి 247 పీజీ మెడికల్ సీట్లు
ఈ మేరకు Telangana State Medical Health Department తాజాగా National Medical Commission (NMC)కు ప్రతిపాదనలు పంపించింది. 2022–23 వైద్య విద్య సంవత్సరం నుంచే ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయని వైద్య వర్గాలు తెలిపాయి. సూర్యాపేట వైద్య కళాశాలలో 25, సిద్దిపేటలో 80, నల్లగొండలో 30, నిజామాబాద్లో 16, ఉస్మానియాలో 32, మహబూబ్నగర్లో 10, కాకతీయ వైద్య కళాశాలలో 10, రిమ్స్ ఆదిలాబాద్లో 22, గాంధీలో 22 చొప్పున పీజీ సీట్లను పెంచాల్సిందిగా ప్రతిపాదించారు.