Skip to main content

సివిల్స్‌లో ఇంటర్వ్యూ దాకా వెళ్లి...మ‌ళ్లీ..: సందీప్ చక్రవర్తి, సివిల్స్ ర్యాంక‌ర్‌

కర్నూలు నగరానికి చెందిన వైద్య విద్యార్థి సివిల్స్‌లో మెరిశాడు. యూపీఎస్సీ ఫలితాల్లో 786వ ర్యాంకు సాధించాడు. కర్నూలు నగరం సి.క్యాంపు సెంటర్‌లో ప్రభుత్వ క్వార్టర్‌లో నివాసముంటున్న డాక్టర్ జీవీ రాంగోపాల్ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సీఎస్‌ఆర్‌ఎంవోగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

ఆయన భార్య పీసీ రంగమ్మ ప్రస్తుతం ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో హెల్త్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. విద్యావంతులైన ఈ దంపతులు తమ పిల్లలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించారు. కన్నవారి ఆశయాల మేరకు పెద్ద కుమారుడు జీవీ ప్రమోద్ చక్రవర్తి ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాడు. కుమార్తె జీవీ సౌజన్య ఏజీ ఎంఎస్సీ పూర్తి చేశారు. చిన్నకుమారుడు సందీప్ చక్రవర్తి ప్రస్తుతం సివిల్స్‌లో 786వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు మార్గం సుగమం చేసుకున్నాడు.

పూర్తి స‌క్సెస్ స్టోరీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 06 Dec 2021 01:22PM

Photo Stories