AP CM YS Jagan Mohan Reddy : సీఎం వైఎస్ జగన్ను కలిసిన సివిల్స్ ర్యాంకర్లు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
![UPSC Civils 2023 Rankers With AP CM YS Jagan](/sites/default/files/images/2023/06/23/upsc-civils-raker-1-1687522691.jpeg)
జాతీయస్థాయిలో టాప్ ర్యాంకులను సాధించి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 17 మంది సివిల్స్లో ఉన్నత ర్యాంకులు సాధించారు. ఈ సివిల్స్ ర్యాంకర్లు జూన్ 23వ తేదీన(శుక్రవారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.
![AP CM YS Jagan with upsc civils rankers](/sites/default/files/inline-images/rankers%203.jpeg)
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సివిల్స్ ర్యాంకర్లను అభినందించారు. అలాగే ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్ ప్రిపరేషన్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై.. ప్రజా పాలనలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు సూచించారు.
ఏపీకి చెందిన 17 మంది యూపీఎస్సీ (సీఎస్ఈ) 2022 ర్యాంకర్లు వీరే..:
![upsc civils ranker 2023](/sites/default/files/inline-images/rankers%202.jpeg)
జీవీఎస్ పవన్ దత్తా, తిరుపతి (ర్యాంక్ 22), ఎం.శ్రీ ప్రణవ్, గుంటూరు (60), ఎల్.అంబికా జైన్, కర్నూలు (69), షేక్ హబీబుల్లా, కర్నూలు (189), కేపీఎస్ సాహిత్య, వైజాగ్ (243), బి.ఉమామహేశ్వర రెడ్డి, కదిరి (270), పి.విష్ణువర్ధన్ రెడ్డి, విజయవాడ (292), వి.లక్ష్మీ సుజాత, మార్టూరు (311), బి.వినూత్న, ఒంగోలు (462), సీ.సమీర్ రాజా, ఆదోని (464), ఆర్.నవీన్ చక్రవర్తి, తాళ్ళచెరువు, పల్నాడు జిల్లా (550), వైయూఎస్ఎల్ రమణి, ఎదరాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (583), టి.హేమంత్, చిలకలూరిపేట (593), పి.భార్గవ్, విజయనగరం (772), కే. శ్రీకాంత్ రెడ్డి, శిరిగిరిపాడు, పల్నాడు జిల్లా (801), ఎం.సుజిత్ సంపత్, నందిగామ (805), ఎన్. కృపాకర్, కడప (866).