Skip to main content

Pranay: డిఫెన్స్‌ పరీక్షలో సైనిక విద్యార్థి ప్రతిభ

చొప్పదండి: నేషనల్‌ ఢిపెన్స్‌ అకాడమీ జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష– 2023లో చొప్పదండి మండలంలోని రుక్మాపూర్‌ శివారు సైనిక శిక్షణ గురుకులానికి చెందిన విద్యార్థి ప్రతిభ కనబరిచాడు.
Pranay
డిఫెన్స్‌ పరీక్షలో సైనిక విద్యార్థి ప్రతిభ

చొప్పదండి మండలం కొలిమికుంటకు చెందిన మల్యాల ప్రణయ్‌ సైనిక విద్యాలయంలో ఇంటర్‌ చదువుతున్నాడు. గత సెప్టెంబర్‌లో యూపీఎస్‌ఈ ద్వారా నిర్వహించిన ఎన్‌డీఏ జాతీయ పరీక్షకు హజరయ్యాడు. ఇటీవల ఫలితాలు విడుదల కాగా జనవరిలో జరిగే ఎస్‌ఎస్‌బీ ఇంర్వ్యూలకు అర్హత సాధించాడు.

చదవండి: Students: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

రుక్మాపూర్‌లో 2018లో సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైనిక శిక్షణ పాఠశాలను ప్రారంభించగా, ఇప్పటి వరకు 24 మంది ఏన్‌డీఏ పరీక్షలో అర్హత సాధించి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ లచ్చయ్య తెలిపారు. ప్రణయ్‌ని గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ డాక్టర్‌ ఈ నవీన్‌ నికోలస్‌ అభినందించారు.

చదవండి: Lieutenant Colonel Abhishek Reddy: లెఫ్టినెంట్ కల్నల్ అభిషేక్ రెడ్డిని ఘ‌నంగా సన్మానించిన గ్రామ‌పెద్ద‌లు..

Published date : 30 Sep 2023 01:58PM

Photo Stories