Arts College Alumni Generosity: ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల ఔదార్యం
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జియాలజీ విభాగంలో 1970–73 బ్యాచ్కు చెందిన విద్యార్థులు డిజిటల్ ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డు (డీఐపీబీ)ను ఆ కళాశాలకు వితరణ చేశారు.
Arts College Alumni Generosity
ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దాదాపు రూ.1.60 లక్షల విలువైన డీఐపీబీని అందజేశారు. పూర్వ విద్యార్థులు గనుల భూగర్భ శాఖ విశ్రాంత డైరెక్టర్ డి.రాజగోపాల్, బాంబే డైయింగ్ నాగన్న, ప్రొఫెసర్ జగన్నాథశెట్టి తదితరులు పాల్గొన్నారు.
వీరికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏసీఆర్ దివాకర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ కె.నాగలక్ష్మి, డాక్టర్ దేవసేన, డాక్టర్ ఆశావాది వంశీ, డాక్టర్ అచ్యుతానంద, డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.