TET Centers for Candidates: టెట్ అభ్యర్థులకు కేంద్రాల కేటాయింపు ఇలా..!
![Teacher Candidates' Preference Order for TET-2024 TET-2024 Announcement Department of School EducationTET-2024: Exam Centers as per Candidate Preference Commissioner of School Education revealed about the centers for TET exam](/sites/default/files/images/2024/02/26/ap-tet-exam-centers-1708927749.jpg)
అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2024కు పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కేటాయిస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆదివారం ‘ఈనాడు’ పత్రికలో ‘టెట్ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష’ పేరిట ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తమని కమిషనరేట్ ఓ ప్రకటనలో ఖండించింది.
APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ గ్రూప్–2 రికార్డు బద్దలు, ముగిసిన ప్రిలిమ్స్, మెయిన్స్ ఎప్పుడంటే..
అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఆరు కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలన్నారు. అలా మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో 82 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్నే కేటాయించినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ పేర్కొన్నారు.
IIT & NIT: మరో 4 వేల సీట్లు పెంచే అవకాశం!
కేటాయింపు ఇలా..
మ్యాథ్స్, సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్న 58,631 మందిలో 90.97 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం 37 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. మరో 3,389 మందికి (5.78 శాతం) రెండో ప్రాధాన్య కేంద్రాన్ని, 1,406 మందికి మూడో ప్రాధాన్య కేంద్రాన్ని, 373 మందికి నాలుగో ప్రాధాన్య కేంద్రాన్ని, 93 మందికి ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు విద్యా శాఖ కమిషనర్ వివరించారు.
APPSC Group -2 Prelims: ఈసారి ప్రిలిమ్స్ అభ్యర్థుల సంఖ్య అత్యధికం..
► సోషల్ విభాగంలో 36,776 మందిలో 31051 మంది (84.43శాతం)కి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం ముగ్గురికి మాత్రమే ఆరో కేంద్రాన్ని కేటాయించారన్నారు.
► తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తుల్లో 149 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, మిగిలిన వారికి మొదటి కేంద్రాన్నే ఇచ్చామన్నారు.
► ఇంగ్లిష్ విభాగంలో 17 మందికి మాత్రమే ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. ఈ విభాగంలో ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని ఎవరికీ ఇవ్వలేదన్నారు.
► హిందీ విభాగంలో 8,752 మందికి (80.43 శాతం) మొదటి ప్రాధాన్య కేంద్రం, మరో ఇద్దరికి ఆరో ప్రాధాన్య కేంద్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఉర్దూ విభాగంలో అందరికీ మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు తెలిపారు.