గుడ్లవల్లేరు(గుడివాడ): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎనిమిదో తరగతికి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులకు బైజూస్ ట్యాబ్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు.
బైజూస్ ట్యాబ్ల వినియోగంపై శిక్షణ
గుడ్లవల్లేరు మండలం, అంగలూరులోని జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో ఏప్రిల్ 11న ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ఐటీ సెల్ ప్రతినిధి రమేష్కుమార్ పరిశీలకుడిగా వ్యవహరించారు. జిల్లా నోడల్ ఆఫీసర్ శివాజీ, రీసోర్స్ పర్సన్ డాక్టర్ పి.వినయ్కుమార్, డైట్ అధ్యాపకులు రాజ్యలక్ష్మి, హరికిరణ్ పాల్గొన్నారు.