Skip to main content

Education: ప్రాంతీయ విద్యాకేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

వెంకటాచలం: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చవటపాళెం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ విద్యా కేంద్రం భవన నిర్మాణానికి కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ డిసెంబ‌ర్ 11న‌ స్థల పరిశీలన చేశారు.
Site consideration for establishment of Regional Education Center, Construction update

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ విద్యాకేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కేంద్రం భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని చవటపాళెంలో కలెక్టర్‌ పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడారు.

చదవండి: Andhra Pradesh: గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి

ప్రాంతీయ విద్యా కేంద్రం భవన నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధర ఇప్పిస్తామని తెలిపారు. విద్యాకేంద్రం ఏర్పాటుకు రైతులందరూ భూములు ఇచ్చి సహకరించాలని కోరారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ నరేష్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Published date : 13 Dec 2023 01:26PM

Photo Stories