Skip to main content

Andhra Pradesh: గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి

కేవీపల్లె : గ్యారంపల్లె ఏపీ గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు.
Working for the development of Gurukula School  Education development focus on AP Gurukula School

డిసెంబ‌ర్ 10న‌ గ్యారంపల్లె ఏపీ గురుకుల పాఠశాలలో గురుకుల ఆలుమ్ని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 40 వసంతాల (రూబి జూబ్లీ) వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

చదవండి: Gurukula School jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతరం ఆలుమ్ని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 6 లక్షలు కేటాయించినట్లు చెప్పారు గ్యారంపల్లెలో గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన రెడ్డెప్పరెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులు రూ. 2 లక్షల చెక్‌ను ఆలుమ్ని అసోసియేషన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కియా మోటార్స్‌ ముఖ్య సలహాదారు టి. సోమశేఖర్‌రెడ్డి, ఆలుమ్ని ఉపాధ్యక్షుడు జె. సాల్మన్‌రాజు, పాఠశాల ప్రిన్సిపాల్‌ బ్రహ్మాజి, మాజీ ప్రిన్సిపాల్స్‌ పి. ఓబయ్య, ఎన్‌.వి. రమణ, ఆనందబాబు, సురేష్‌, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Published date : 11 Dec 2023 03:13PM

Photo Stories