School Education Department: ప్రిన్సిపాల్స్కు పే ప్రొటెక్షన్
Sakshi Education
మోడల్ స్కూల్స్లో 2010 డీఎస్సీ ద్వారా ప్రిన్సిపాల్స్గా నియమితులైన ఇన్ సర్వీస్ పీజీటీలకు పే ప్రొటెక్షన్ అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రిన్సిపాల్స్కు పే ప్రొటెక్షన్
దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ సర్క్యులర్ జారీ చేశారు. ఇన్ సర్వీస్ ప్రిన్సిపాల్స్కి పే ప్రొటెక్షన్ ఇవ్వడంపై మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోíసియేషన్ ఏపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటెరు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ఇతర యాజమాన్యాల నుంచి వచ్చి మోడల్ స్కూల్స్లో చేరిన టీచర్లకు, మోడల్ స్కూల్స్లోనే టీజీటీ నుంచి పీజీటీగా ఎంపికైన టీచర్లకు కూడా పే ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరారు.