ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం బోధనా పద్ధతులను పరిశీలిస్తున్న ఉత్తరప్రదేశ్ బృందం రెండో రోజు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, ఏపీ మోడల్ స్కూళ్లను సందర్శించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం బోధనా పద్ధతులను పరిశీలిస్తున్న ఉత్తరప్రదేశ్ బృందం
అక్కడ రెసిడెన్షియల్ పద్ధతిలో బోధన విధానాలు, వసతి, విద్యార్థుల్లో ప్రావీణ్యాన్ని పరిశీలించింది. గ్రామీణ పాఠశాల విద్యార్థుల్లో ఆంగ్ల పాటవాన్ని, ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలను ప్రశంసించింది. అనంతరం విజయవాడలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ ప్రతాప్రెడ్డిని కలిసింది.