School Education Department: పాఠశాలల పనివేళల్లో ఈ ప్రచారం వద్దు
Sakshi Education
ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు, టీచర్ల సంఘాల నేతలు పాఠశాల పనివేళల్లో ఎన్నికల ప్రచారం చేయరాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
పాఠశాలల పనివేళల్లో ఈ ప్రచారం వద్దు
అలాచేస్తే చట్టపరమైన చర్య లు తప్పవని స్పష్టం చేసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పాఠశాలల పనివేళల్లో టీచర్ల సంఘాల నేతలు ప్రచా రం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఆ కారణంగా విద్యాభ్యాసన కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఎదురవుతుందని వివరించింది. డీఈవోలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.