Skip to main content

School Education: విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు అవగాహన

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రగతిని వివరించేందుకు ఉపాధ్యా­యులు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లనున్నారు.
Parents are aware of the progress of students  Teachers visiting student homes to discuss educational progress

ప్రభుత్వ పాఠ­శాలలు, కళాశాలల అభివృద్ధిని వివరించనున్నారు. ఈ మేరకు మే 31న‌ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో 2024–25 విద్యా సంవత్సరం నుంచి ‘ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల గృహ సందర్శన కార్యక్రమం’ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించడం కోసం ఈ విధానం అమలు చేస్తున్నట్లు వివరించారు.

చదవండి: Private schools: ప్రైవేట్‌ స్కూళ్లకు ఝలక్‌.. బుక్స్‌, యూనిఫాంలు అమ్మడానికి వీల్లేదు

విద్యార్థులు ఉన్నతమైన ప్రగతి సాధించాలంటే ఉపాధ్యా­యులతోపాటు తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని, విద్యలో తల్లిదండ్రుల ప్రమేయం విద్యాపరమైన ఫలితాలను గణనీయంగా పెంచుతుందన్నారు. తరగతి ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఇంటిని విద్యా సంవత్సరంలో రెండు సార్లు (జూన్, జనవరి) సందర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా పిల్లల చదువు తీరు, విద్యా ఫలితాలను తల్లిదండ్రులకు వివరించాలన్నారు.  

Published date : 01 Jun 2024 05:24PM

Photo Stories