Skip to main content

Gurukul School Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివ‌రి తేదీ ఇదే

ముసునూరు: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ముసునూరు బాలికల గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్‌ కొండాబత్తుల ప్రవీణ తెలిపారు.
Invitation of applications for admissions in Gurukuls

మార్చి 4న‌ ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ప్రవేశాల వివరాల సంబధిత వాల్‌ పోస్టర్లను జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహాం విడుదల చేసినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 1న‌ ప్రారంభమైందని, మార్చి 31 వరకూ కొనసాగుతుందన్నారు.

చదవండి: School Admissions: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల.. సీట్ల సంఖ్య ఇలా..

జిల్లాలోని ముసునూరు (బాలికలు), నాగిరెడ్డిగూడెం (బాలికలు), అప్పలరాజుగూడెం (బాలురు) గురుకులాల్లో 5వ తరగతిలో 80 చొప్పున, 240 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలను బట్టి ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఏప్రిల్‌ 25న ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌ పరీక్ష, మధ్యాహ్నం ఏపీఆర్‌జేసీ, డీసీ, సెట్‌ ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు.

Published date : 05 Mar 2024 04:27PM

Photo Stories