Education: చదువుతోనే బడుగులకు గుర్తింపు: ఆర్‌.కృష్ణయ్య

మలక్‌పేట: బడుగు, బలహీన వర్గాలకు చదువుతోనే గుర్తింపు వస్తుందని, బాగా చదువుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆకాంక్షించారు.

మహనీయుల ఆశయాల సాధనకు యువత ఉద్యమించాలని అన్నారు. తెలంగాణ సోషలిస్ట్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూరెళ్ల మహేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న‌ మూసారంబాగ్‌లో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

చదవండి: Success with Talent and Hardwork: కసిగా ప్రతిభను కనబరచండి.. ఎదుటివారికి స్పూర్తిగా నిలవండి..

ఈ సందర్భంగా జ్యోతిరావుపూలే, సావిత్రి బాయిపూలే, డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌ విద్యార్థులు స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు ర్యాలీ చేపట్టారు.

చదవండి: Twin Sisters Success Stories : ఈ ట్విన్‌ సిస్టర్స్‌.. ఒకే ప‌రీక్ష‌లో ఆల్ ఇండియా టాపర్స్‌.. కానీ ఈ కుటుంబం అంతా కూడా..

కార్యక్రమంలో అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌, గ్రేటర్‌ ఇన్‌చార్జి ప్రవీణ్‌, నాయకులు యశ్వంత్‌, శ్రీకాంత్‌, మహేశ్‌, చంద్రకళ, సత్యనారాయణ, మమత, సరిత, లావణ్య, మానస తదితరులు పాల్గొన్నారు.

#Tags