DEO Praneetha: విద్యార్థులకు మరింత పోషకాహారం
తలమడుగు: ‘తిథి’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మరింత పోషకాహారం అందుతుందని డీఈవో ప్రణీత అన్నారు.
ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తిథి భోజన కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో జూలై 30న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అదనంగా పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అయితే ఇలాంటి కార్యక్రమం పాఠశాలలో ఏడాదిగా కొనసాగడం అభినందనీయమన్నారు.
చదవండి: Collector Inspection: గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
అనంతరం పదోతరగతి విద్యార్థులకు పలు సూ చనలు అందించారు. విద్యార్థులను న్యాస్ పరీక్షకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శ్రీకాంత్గౌడ్, కాంప్లెక్స్ హెచ్ఎం కృష్ణకుమారి, ప్రత్యూష, ఆర్పీలు శంకర్, నగేష్, సంతోష్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
#Tags