Inter Evaluation: ముగిసిన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం..
రాష్ట్రంలో వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల పరీక్షలు ముగిసాయి. అయితే, జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంటర్ మూల్యాంకనం గురించి వివరించారు..
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,75,139 జవాబుపత్రాలను జిల్లాకు పంపించగా గత నెల 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించారు.
ప్రతీ అధ్యాపకుడు రోజుకు 30 చొప్పున జవాబుపత్రాలను దిద్దగా, శుక్రవారంతో వాల్యూయేషన్ పూర్తయిందని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు.
#Tags