Jobs: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులు

శాంతినగర్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంతినగర్‌లో 2023–24 విద్యా సంవత్సరానికి తెలుగు–1 బోధించేందుకు గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ డా.కె.చంద్రశేఖర్‌ న‌వంబ‌ర్ 6న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

 ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, ఇతరులకు 55 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండి పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ అర్హత కలిగి బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

న‌వంబ‌ర్ 8, 9 తేదీల్లో ఉదయం 11 గంటలకు ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గద్వాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.

చదవండి:

Good News for Inter students: ఇంటర్‌ విద్యార్థులకు తీపి కబురు

DEO Praneetha: తొలిమెట్టు వలంటీర్లకు శిక్షణ

#Tags