TSPSC Group 1 Posts Competition Ratio 2024 : ఫైనల్గా గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ అంటే...?
టీఎస్పీఎస్సీ 563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెల్సిందే. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు. మరో 20 మంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు పరీక్ష రాసేందుకు ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి పొందారు.
గ్రూప్-1 మెయిన్స్ హాజరు శాతం ఇంతేనా...?
అయితే, మొత్తం వారం రోజుల పాటు కేవలం 21,093 (67.17%) మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో ఉన్నట్టయింది. చివరి రోజు ఆదివారం 21,151 మంది హాజరయ్యారు.
➤☛ ఏఏ నెలలో.. ఏఏ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారంటే..? గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంపు ?
నాన్-లోకల్ అభ్యర్థులు..
గ్రూప్ 1లో 5% అన్ రిజర్వ్డ్ పోస్టులకు మొత్తం 2,550 మంది అభ్యర్థులతో షార్ట్లిస్ట్ చేసినట్టు చెప్పారు. దీంట్లో 182 మంది నాన్-లోకల్ అభ్యర్థులు ఉన్నారు.
అత్యధికంగా బీసీలే గ్రూప్-1కి...
గ్రూప్ 1 మెయిన్స్కు సెలక్ట్ అయిన వారి వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఏ కేటగిరీకి చెందిన వారు ఎంతమంది క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం ప్రకటించింది. ఒక్కో పోస్టుకు 1:50 రేషియోలో గ్రూప్-1 మెయిన్స్కు మొత్తం 31,383 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఓసీలు 3,076 మంది ఉన్నారు. అత్యధికంగా బీసీలు17,921 మంది అర్హత సాధించగా, ఎస్సీలు 4,828 మంది, ఎస్టీలు 2,783 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,774 మంది క్వాలిఫై అయ్యారు. పీడబ్ల్యూడీ కేటగిరీలో మెయిన్స్కు 1,299 మందిని ఎంపిక చేశామని, కానీ వారిని ఆయా కమ్యూనిటీల్లో చూపించామని టీజీపీఎస్సీ తెలిపింది.
➤☛ TSPSC Group 2 Ranker Interview : ఇంటి నుంచే చదివి గ్రూప్-2 జాబ్ కొట్టానిలా...| గ్రూప్-2కు నేను చదివిన పుస్తకాలు ఇవే...