World Skate Games: ప్రపంచ స్కేట్‌గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం

శృతికా సరోదే నేతృత్వంలోని భారత మహిళల రోలర్‌ డెర్బీ జట్టు ఇటలీలో జరిగిన ప్రపంచ స్కేట్‌గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించింది. 

భారత జట్టు, చైనా జట్టుపై అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. శృతికా సరోదే తన నాయకత్వంతో జట్టును ప్రేరేపిస్తూ, ప్రత్యర్థుల బలహీనతలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంది.

శృతికా సరోదే 15 సంవత్సరాల నుంచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ 100కి పైగా పతకాలు, ట్రోఫీలు గెలుచుకుంది. ఆమె ప్రపంచ మరియు ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి తన అనుభవాన్ని జట్టుకు అందించింది.

శృతికా సరోదే సాధించిన విజయాలను గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ‘శివ ఛత్రపతి’ అవార్డుతో సత్కరించింది.

Asian Champions Trophy: ఐదోసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ గెలుచుకున్న భారత్‌

#Tags