JNTU Students: విద్యార్థులకు అభినంద‌న‌లు.. కార‌ణం..?

ప్రీ ప‌రేడ్ కు ఎంపికైన‌ జేఎన్‌టీయూ ప‌రిధిలోని విద్యార్థుల‌ను వ‌ర్సిటీ వీసీ, త‌దిత‌ర అధ్యాప‌కులు అభినందించారు.
College faulty of JNTU Anantapuram

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్రీ రిపబ్లిక్‌ పరేడ్‌ క్యాంప్‌లో ప్రాతినిథ్యం వహించే జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని విద్యార్థుల ఎంపిక ప్రక్రియ మంగళవారం నిర్వహించారు. ఎంపికైన వారిలో షేక్‌ సనా అంజుమ్‌, వై.యామిని (జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్‌), డీవీవీఎస్‌ చరిత (జేఎన్‌టీయూ–కలికిరి) ఉన్నారు.

➤   Open Schools Admissions: ఓపెన్‌ స్కూల్‌లో దరఖాస్తులు..

ఎంపికైన విద్యార్థులను జేఎన్‌టీయూ (ఏ) వీసీ డాక్టర్‌ జింకా రంగజనార్ధన, రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌ అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌.శారద, డాక్టర్‌ జి.మమత, డాక్టర్‌ డి.విష్ణువర్ధన్‌, డాక్టర్‌ దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

#Tags