Dr YSRUHS: వైద్య విద్య తుది మెరిట్‌ జాబితాల విడుదల

సాక్షి, అమరావతి: MBBS, BDS కోర్సుల్లో 2022–23 విద్యా సంవత్సరానికి యాజమాన్య కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తుది మెరిట్‌ జాబితాను నవంబర్‌ 11న డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది.
వైద్య విద్య తుది మెరిట్‌ జాబితాల విడుదల

తుది మెరిట్‌ జాబితాలో 3,021 మందికి స్థానం దక్కింది. అదే విధంగా అనర్హులైన విద్యార్థుల జాబితాను ప్రకటించారు. నవంబర్‌ 12 నుంచి యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెబ్‌ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ప్రారంభిస్తారు. దీనికి నవంబర్‌ 14 ఆఖరి గడువు.

చదవండి: YSRUHS: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు

ఆర్మీ పిల్లల కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తుది మెరిట్‌ జాబితాను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లో ఉంచారు. 

చదవండి: YSRUHS: హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు ప్రక్రియ పూర్తి

#Tags