‘విదేశీ విద్యానిధి’ దరఖాస్తుల గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
‘విదేశీ విద్యానిధి’ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల వినతుల మేరకు ఈ పథకం ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియను అక్టోబర్‌ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సెప్టెంబ‌ర్ 29న ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి:

Study Abroad: విదేశాల్లో చదువుపై ట్రిపుల్‌ ఐటీతో ఒప్పందం

Study Abroad: వీసా తిరస్కరణకు ముఖ్యమైన‌ కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

#Tags