Agriculture Courses: వ్యవసాయ కోర్సుల దరఖాస్తుకు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వ విద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు తేదీని ఈనెల 29 వరకు పొడిగించారు.

ఈ మేరకు జయ శంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజి స్ట్రార్‌ డాక్టర్‌ పి.రఘురామిరెడ్డి తెలిపారు.  తొలి విడతలో దరఖాస్తు చేసుకోని అభ్య ర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.pjtsau.edu.inను సందర్శించాలని సూచించారు. 

చదవండి:

TSPSC Group 2 Best Preparation Plan : గ్రూప్‌-1కి ప్రిపేర్ అయితే.. గ్రూప్‌-2 ఉద్యోగం కొట్ట‌వ‌చ్చు ఇలా..?

India's Key Agreements : వియత్నాంతో భారత్‌ కీలక ఒప్పందాలు.. మొత్తం 9 రంగాల్లో!

#Tags