Skip to main content

2 Students 1 Teacher: ఇద్దరు పిల్లలు.. ఒక టీచర్‌

టేకులపల్లి: మండలంలోని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌లో ఉన్న మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు.
two children one teacher

ఒక్క టీచర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో 2023 విద్యాసంవత్సరంలో ప్రారంభంలో 11 మంది విద్యార్థులు ఉన్నారు. కొందరు టీసీ తీసుకుని వెళ్లగా ప్రస్తుతం ఇద్దరే విద్యార్థులు చదువుతున్నారు.

సోమవారం రాఖీ పండుగ కారణంగా ఆగ‌స్టు 20న‌ ఆ ఇద్దరూ పాఠశాలకు రాలేదు. కాగా ఇక్కడ మోతుకూరి పద్మ, హనుమంతు అనే ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. హనుమంతు రెండేళ్ళ బీఈడీ కోర్సు కోసం ఓడీలో ఉన్నారు.

చదవండి: No Education Funds : పాఠ‌శాల అభివృద్ధికి నిధులు లేక ప్ర‌ధానోపాధ్యాయులే స్వ‌యంగా..!

రాష్ట్రవ్యాప్తగా జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా హెచ్‌ఎం పద్మకు అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట ఉన్నత పాఠశాలకు స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ సబ్జెక్టు టీచర్‌గా పదోన్నతి లభించింది. జూన్‌లో వెళ్లి అక్కడ విధుల్లో చేరారు. అయితే ఓడీలో ఉన్న టీచర్‌ రాకపోవడంతో, ఆమెను తిరిగి డిప్యుటేషన్‌పై ఇదే పాఠశాలకు పంపించారు.

Published date : 21 Aug 2024 03:16PM

Photo Stories