Job Mela: 15న రీజినల్ జాబ్మేళా
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని విజ్ఞానసుధ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15న రీజినల్ జాబ్మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జాబ్మేళా పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత కలిగిన నిరుద్యోగులకు జాబ్మేళా సమాచారం చేరవేయాలన్నారు. దాదాపు 100 కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. 10 వ తరగతి నుంచి పీజీ వరకు పాస్, ఫెయిల్ అయిన వారు పాల్గొనవచ్చని తెలిపారు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఇతర వివరాలకు 9063561786, 9493210966, 8142509017 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్యాంమోహన్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.