Inter Exam Fee: ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పెంపు

శ్రీకాకుళం న్యూకాలనీ: మార్చిలో జరిగే ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం గడువు పెంచింది. వాస్తవానికి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగియగా.. ఫీజులు చెల్లించలేని విద్యార్థులను, తుఫానుప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభు త్వ ఆదేశాల మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఈనెల 11వ తేదీ వరకు గడువు పెంచింది. దీంతో రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు గతంలో ఫెయిలైన్‌ విద్యార్థులు, ప్రైవేటు విద్యార్థులు సైతం ఫీజులు చెల్లింపులు చేసుకోవచ్చు. వివిధ కారణాలతో పరీక్ష ఫీజులు చెల్లించని విద్యార్థులు ఈనెల 11వ తేదీలోగా చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉందని ఇంటర్మీడియెట్‌ విద్య డీవీఈవో కోట ప్రకాశరావు, ఇంటర్మీడియెట్‌ బోర్డు జిల్లా అధికారి పి.దుర్గారావు పేర్కొన్నారు.

#Tags