Skip to main content

Results: తెయూ డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

తెయూ(డిచ్‌పల్లి): తెయూ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) 2వ, 4వ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ అరుణతో కలిసి బుధవారం విడుదల చేశారు.
University Examination Results Announcement,తెయూ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) 2వ, 4వ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు,Controller Prof. Aruna
తెయూ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) 2వ, 4వ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు

జూన్‌లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల్లో బాలికలేపై చేయి సాధించినట్లు తెలిపారు. డిగ్రీ 2వ సెమిస్టర్‌ పరీక్షలకు 8,985 మంది విద్యార్థులు హాజరు కాగా 442 మంది బాలురు (11.96 శాతం) 1,904 మంది బాలికలు (36 శాతం) మొత్తం 2,346 మంది (26.11 శాతం) ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 4వ సెమిస్టర్‌ పరీక్షలకు 9,939 మంది విద్యార్థులు హాజరు కాగా 720 మంది బాలురు (17.02 శాతం), 2,589 మంది బాలికలు (45.36 శాతం) మొత్తం 3,309 మంది (33.29 శాతం) ఉత్తీర్ణులైనట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. ఈ ఫలితాల్లో బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 

APPSC Group-1 State 1st Ranker Bhanusri Lakshmi: టాపర్ టిప్స్.. ఇవి పాటిస్తే విజయం మీదే!!

Published date : 22 Sep 2023 09:58AM

Photo Stories