High Jump: జాతీయస్థాయిలో హైజంప్కు ఎంపికైన విద్యార్థిని
Sakshi Education
ఇటీవలె నిర్వహించిన క్రీడా పోటీల్లో హైజంప్లో పాల్గొంది జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని. తన గెలుపు గురించి తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం తనను అభినందించారు..
![School sports champion honored by management Zilla Parishad Girls High School sports competition Zilla Parishad Girls High School student selects for National Level High Jump](/sites/default/files/images/2024/02/12/durgabhavani-high-jump-1707712493.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: అథ్లెటిక్స్ విభాగంలో జాతీయస్థాయి హైజంప్ పోటీలకు ఈపురుపాలెంకు చెందిన విద్యార్థిని కొండేపి దుర్గా భవాని ఎంపికయ్యింది. ఈపురుపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దుర్గాభవాని ఇటీవల కడవకుదురులో జరిగిన క్రీడా సెలక్షన్స్లో అండర్–16 బాలికల హైజంప్లో పాల్గొంది.
Science Fair: రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ విద్యార్థులవే..
ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన దుర్గా భవానిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు గుజరాత్ రాష్ట్రంలో జరగబోయే 19వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్ (ఎన్ఐడీజేఏఎం)కి ఎంపికైంది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన దుర్గా భవానిని పాఠశాల హెచ్ఎం కె.హనోర, డీఎన్ రోజ్ హెల్మా, ఉపాధ్యాయులు అభినందించారు.
Published date : 12 Feb 2024 10:04AM