Skip to main content

Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్‌, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఈ సమయంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విద్యా సంస్థలను తెరవవద్దని అక్కడి ప్రభుత్వం కీల‌క ఆదేశాలు ఇచ్చింది.
Holidays
School and Colleges Holidays

రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలను ఫిబ్రవరి 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఆన్‌లైన్ తరగతులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. గతంలో పెరిగిన కరోనా కేసుల మధ్య, జనవరి 30వ తేదీ నాటికి ఉత్తరప్రదేశ్‌లోని విద్యా సంస్థలను మూసివేయాలని మార్గదర్శకాలు జారీ చేసిన విష‌యం తెల్సిందే. అంతకుముందు జనవరి 23వ తేదీ వరకు మాత్రమే పాఠశాలలు కళాశాలను మూసివేయాలని ప్రభుత్వం భావించింది.

Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కార‌ణం ఇదే..?

పరీక్షలు వాయిదా..
అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాఠశాలలు, విద్యా సంస్థలను మూసివేసింది. యూనివర్సిటీ-కాలేజీ సెమిస్టర్ పరీక్షలు ఇప్పటికే వాయిదా పడగా.. జనవరి 16వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను కూడా వాయిదా వేసింది.

తెలంగాణ మాత్రం విద్యాసంస్థల పునః ప్రారంభం అప్పటి నుంచే..
విద్యా సంస్థలను జ‌న‌వ‌రి 31వ తేదీ నుంచి పునః ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది.విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం జ‌న‌వ‌రి 30 వరకూ పొడిగించింది. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో విద్యా బోధన కుంటుపడిందన్న వాదన కూడా విన్పిస్తోంది.

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

సెలవులు పొడిగించకతప్పదనే..
తాజా పరిస్థితిని గమనిస్తే కోవిడ్‌ తీవ్రత జ‌న‌వ‌రి నెలాఖరుకు క్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 31 నుంచి విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై అధికారుల నుంచి నివేదిక కోరినట్టు మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే, కరోనా తీవ్రత పెరిగితే సెలవులు పొడిగించకతప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ క్లాసులపై క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించగా, కొద్ది రోజుల కోసం ఎందుకన్నట్టు బదులిచ్చారు. దీన్నిబట్టి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం బలమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది.  

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

ఈ సారి పరీక్షలను..
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పరీక్షల రద్దు, ప్రమోట్‌ చేయడం వంటివి ఉండబోవని సబిత తేల్చి చెప్పారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఆమె అన్నారు. విద్యార్థులు ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ పరీక్షల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని చెప్పారు.

ఏపీలో స్కూళ్లకు, కాలేజీల‌కు సెల‌వులు ఇవ్వం..ఎందుకంటే..?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఆ స్కూల్‌ను మాత్రమే మూసివేసి త‌ర్వాత ప్రారంభిస్తామ‌న్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Published date : 28 Jan 2022 12:15PM

Photo Stories