ఓవర్సీస్ పథకం ద్వారా పొందే స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసేందుకు గడువు ముగియనున్నది. ఈ సమాచారాన్ని మైనార్టీ సంక్షేమ శాఖాధికారి తెలిపారు. ఆ గడువు ఎన్నటికో క్రింది వివరాల ద్వారా తెలుసుకోండి..
Applications for scholarships are closing
సాక్షి ఎడ్యుకేషన్: మైనార్టీ విద్యార్థులు సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా ఉపకార వేతనాలు పొందేందుకు ఈనెల 25వ తేదీతో గడువు ముగుస్తుందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మెహరాజ్ మహమ్మద్ తెలిపారు. ఇంజినీరింగ్లో 60 శాతం, డాక్టరేట్ చేసేందుకు పీజీలో 60 శాతం మార్కులు సాధించి, ఈ ఏడాది జూలై ఆఖరునాటి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందినవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.