Semester Books Distribution: పూర్తిగా పంపిణీ చేసిన పుస్తకాల
Sakshi Education
ప్రతీ ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థులకు పుస్తకాలను సమయమనుసాంగానే పంపిణీ పూర్తి చేసామన్నారు డీఈఓ. పాఠ్యపుస్తకాల పంపిణీ గురించి ఆయన మాటల్లో..
DEO Prem kumar speaks about semester books distribution
సాక్షి ఎడ్యుకేషన్: సెకెండ్ సెమిస్టర్ పుస్తకాల పంపిణీ శతశాతం పూర్తి చేశామని డీఈఓ ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గతంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యంగా జరిగేదని ప్రస్తుతం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి పాఠ్య పుస్తకాలను సకాలంలో పంపిణీ పూర్తి చేశామన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల అభ్యున్నతికి అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 15 మండలాల్లో 1584 ప్రభుత్వ పాఠశాలల్లో 94,725 మంది విద్యార్థులకు పుస్తకాలు పూర్తి స్థాయిలో అందజేసామన్నారు. విద్యార్థులకు మిస్ మ్యాచ్ షూలను అందజేసామన్నారు.