Skip to main content

PRAJA VANI: ప్రజావాణిలో స్వీకరించిన వినతుల‌కి త్వరితగతిన పరిష్కారం చూపండి

PRAJA VANI
ప్రజావాణిలో స్వీకరించిన వినతుల‌కి త్వరితగతిన పరిష్కారం చూపండి

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల్ని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ మాట్లాడుతూ.. ప్రజావాణిలో ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌కు 22, 2బీహెచ్‌కే నోడల్‌ ఆఫీసర్‌కు 12, ఎంజీఎం సూపరిండెంటెంట్‌కు 8, ఆర్డీఓ హనుమకొండకు 7, వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 119 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌కుమార్‌, జీఎం ఇండస్ట్రీస్‌ హరిప్రసాద్‌, హనుమకొండ ఆర్డీఓ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చ‌ద‌వండి: రసాయన ఎరువుల్లో ఉండని మూలకం ఏది? (గ్రూప్‌-2, 2008)

ఇవీ చ‌ద‌వండి: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి.!

Published date : 05 Sep 2023 03:07PM

Photo Stories