Awarding Poet: ప్రముఖ కవి పొందిన జాతీయ పురస్కారం
Sakshi Education
ఇటీవలే ప్రకటించినట్లుగా ప్రముఖ కవి, రచయితకు పురస్కారం అందజేయనున్నారు. ఈ సంవత్సరం ఎంపికైన కవిని వచ్చే నెల పురస్కరించనున్నట్లు తెలిపారు.
The poet and writer getting awarded next month
సాక్షి ఎడ్యుకేషన్: ప్రముఖ కవి, రచయిత బద్దిపూడి జయరావు ఎం.చిన నాగయ్య స్మారక జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు నాగయ్య మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధి రామ్ ప్రదీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2023 సంవత్సరానికి గానూ జయరావు ఎంపికయ్యారని, వచ్చే నెలలో పురస్కారాన్ని అందజేస్తామని తెలిపారు. జయరావు మండలంలోని నూకవరం గ్రామం వాసి. ప్రైవేట్ తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు. కవులు రామబ్రహ్మం, డాక్టర్ జయజీవితరాజు ఆయన అభినందనలు తెలిపారు.