Skip to main content

UPSC NDA & NA I Exam 2025 Notification: ఇంటర్‌తోనే ఎన్‌డీఏ, ఎన్‌ఏతో త్రివిధ దళాల్లో ఆఫీసర్‌గా అడుగు పెట్టే అవకాశం..

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ.. ఇంటర్మీడియెట్‌తోనే త్రివిధ దళా(ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ)ల్లో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకు హోదాతో..
UPSC NDA and NA I Exam 2025 Notification Guidance  NDA, NA(1)-2025 preparation tips

కొలువు సొంతం చేసుకునేందుకు చక్కటి మార్గం. కొలువుతోపాటు బీఏ, బీఎస్‌సీ, బీటెక్‌ డిగ్రీలు పొందే అవకాశం కూడా లభిస్తుంది. వీటిలో ప్రవేశానికి యూపీఎస్‌సీ ప్రతి ఏటా రెండుసార్లు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ, ఎన్‌ఏ) ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తుంది. తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించి.. ఎన్‌డీఏ,ఎన్‌ఏ(1)–2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఎన్‌డీఏ, ఎన్‌ఏ (1)–2025 ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..

త్రివిధ దళాల్లోని(ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ) విభాగాల్లో లెఫ్ట్‌నెంట్‌ లేదా పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకు హోదాలో ఖాళీల భర్తీ ప్రక్రియకు తొలి దశగా ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో విజయం ఆధారంగా అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాధాన్యం అనుసరించి ఆయా విభాగాల్లో మలిదశ ఎంపిక ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.

చదవండి: 500 Vacancies Open: ఎన్‌ఐఏసీఎల్, ముంబైలో 500 అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

406 పోస్ట్‌లతో నోటిఫికేషన్‌

ఎన్‌డీఏ, ఎన్‌ఏ(1)–2025 ద్వారా త్రివిధ దళాల్లో మొత్తం 406 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీకి సంబంధించి ఆర్మీ 208 ఖాళీలు, నేవీ 42 ఖాళీలు, ∙ఎయిర్‌ఫోర్స్‌(ఫ్లయింగ్‌ విభాగం) 92 ఖాళీలు, ∙ ఎయిర్‌ఫోర్స్‌ గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌) 18 ఖాళీలు, ∙ ఎయిర్‌ఫోర్స్‌గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌) 10 ఖాళీలు, 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ 36 ఖాళీలు ఉన్నాయి. ∙నేవల్‌ అకాడమీకి  కేవలం పురుష అభ్యర్థులే అర్హులని పేర్కొన్నారు.
అర్హతలు

  • ఆర్మీ వింగ్‌: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. 
  • ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్‌ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణుల వ్వా లి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభ్య ర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు 2025, డిసెంబర్‌ 15 నాటికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. 
  • వయసు: జూలై 2, 2006–జూలై 1, 2009 మధ్య జన్మించి ఉండాలి. 
  • రెండు దశల ఎంపిక: ఇంటర్మీడియెట్‌ అర్హతతో నిర్వహించే ఎన్‌డీఏ, ఎన్‌ఏకు అభ్యర్థులను ఖరా రు    చేసే క్రమంలో రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అవి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ. తొలిదశగా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధా రంగా.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న తమ ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుని వాటి  ఆధారంగా.. మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సాధించిన వారికి తదుపరి దశలో సదరు విభాగాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) ఎస్‌ఎస్‌బీల ఆధ్వ ర్యంలో ప్రత్యేక పరీక్షలు ఉంటాయి. వీటిలోనూ ఉత్తీర్ణత సాధిస్తే త్రివిధ దళాల్లో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకుతో కొలువు ఖరారవుతుంది. 

శిక్షణ, డిగ్రీ సర్టిఫికెట్‌

  • ఎంపిక ప్రక్రియలోని రెండు దశల్లోనూ విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్య ర్థులకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీల్లో శిక్షణనిస్తారు. 
  • ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాలకు సంబంధించి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పుణెలో, నేవల్‌ అకాడమీ అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్‌ అకాడమీలో శిక్షణనిస్తారు.   అభ్యర్థులు దరఖా స్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న విభాగా లను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకు న్న వారికి జేఎన్‌యూ నుంచి బీఏ, బీఎస్సీ, బీటెక్‌ పట్టాలు కూడా అందజేస్తారు. అంటే ఒకే సమయంలో కొలువు, ఉన్నత విద్య రెండింటినీ సొంతం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. 

మూడేళ్ల శిక్షణ

  • ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్ష తర్వాత నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలోనూ విజయం సాధించిన వారికి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ– పుణెలో మూడేళ్ల వ్యవధిలో శిక్షణ ఉంటుంది. మొదటి రెండున్నరేళ్లు అన్ని విభాగాల అభ్య ర్థులకు ఒకే విధంగా శిక్షణ ఇస్తారు. చివరి ఆరు నెలలు అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. ఇలా మొత్తం మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్‌యూ–ఢిల్లీ నుంచి బీఏ, బీఎస్‌సీ, బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) డిగ్రీలను అందిస్తారు. ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ విభాగాలను ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న వారికి బీటెక్‌ చదివేందుకు కూడా అవకాశం ఉంటుంది. వీరు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేయాలి.

చదవండి: BEL Recruitment 2024: బెల్‌ బెంగళూరులో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం.. అర్హత ఇదే..

నేవల్‌ అకాడమీ10+2 క్యాడెట్‌ ఎంట్రీ..ప్రత్యేక శిక్షణ

ఎన్‌ఏ 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్‌ అకాడమీ(ఎజిమల)లో నాలుగేళ్లపా టు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, నేవల్‌ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్‌ సర్టిఫికెట్‌ అందిస్తారు. 

ఆకర్షణీయమైన స్టయిఫండ్‌

ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి శిక్షణ సమయంలో ఆకర్షణీయ మైన స్టయిఫండ్‌ అందిస్తారు. పే లెవల్‌–10కు సమానమైన రూ.56,100 స్టైపెండ్‌గా అందిస్తారు. ఆ తర్వాత ఫీల్డ్‌ ట్రైనింగ్‌ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రూ.56,100– రూ.1,77,500 వేతన శ్రేణితో కెరీర్‌ ప్రారంభం అవుతుంది. ప్రారంభంలో ఆర్మీ విభాగంలో లెఫ్ట్‌నెంట్, నేవీ విభాగంలో సబ్‌ లెఫ్ట్‌నెంట్, ఎయిర్‌ఫోర్స్‌ విభాగంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ కేడర్‌తో కెరీర్‌ ప్రారంభమవుతుంది.

తొలిదశ రాత పరీక్ష ఇలా

  • ఊ    ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్షను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్‌1లో మ్యాథమెటిక్స్‌ 300 మార్కులు, రెండున్నరగంటలు, జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 600 మార్కులకు రెండున్నర గంటలకు పరీక్ష జరుగుతుంది. ఇలా మొత్తం 900 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
  • ఊ    పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పేపర్‌–2గా నిర్వహించే జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో పార్ట్‌–ఎ పేరుతో 200 మార్కులకు ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ విభాగం ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం పేరుతో పార్ట్‌–బిని నిర్వహిస్తారు. పార్ట్‌–బికి 400 మార్కులుంటాయి.

400 మార్కులకు పార్ట్‌–బి

  • పేపర్‌–2లో పార్ట్‌–బిని 400లకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం ఆరు విభాగాలు(ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్‌ ఈవెంట్స్‌) నుంచి ప్రశ్నలడుగుతారు. ప్రతి విభాగానికి సంబంధించి నిర్దిష్టంగా వెయిటేజీని పేర్కొన్నారు. ఫిజిక్స్‌కు 25 శాతం, కెమిస్ట్రీకి 15 శాతం, జనరల్‌ సైన్స్‌కు 10 శాతం, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమానికి 20 శాతం, జాగ్రఫీకి 20 శాతం కరెంట్‌ ఈవెంట్స్‌కు పది శాతం వెయిటేజీ కల్పించారు. 
  • ఈ వెయిటేజీ ప్రకారమే ఆయా విభాగాల్లో ప్రశ్నల సంఖ్య, మార్కులు ఉంటాయి. 

ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ ఇలా

ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలో విజయం సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మలి దశలో మరో 900 మార్కులకు ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము దరఖా స్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న ప్రాథమ్య తలు, రాత పరీక్షలో పొందిన మెరిట్‌ ఆధారంగా.. నిర్దేశిత విభాగం ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌బీ(సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌) నిర్వహించే ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌లోనూ నెగ్గాల్సి ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్‌ విభాగాన్ని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌బీ తర్వాత జరిగే కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టమ్‌లో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. 

కమిషన్డ్‌ హోదాతో కొలువులు

అన్ని రకాల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి త్రివిధ దళాల్లో కమిషన్డ్‌ హోదాలో కొలువులు ఖరారు చేస్తారు. ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా, నేవీలో సబ్‌ లెఫ్ట్‌నెంట్‌గా, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా తొలి హోదా ఉంటుంది. ఆ తర్వాత పనితీరు ప్రతిభ ఆధారంగా జనరల్, అడ్మిరల్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వంటి హోదాలకు చేరుకోవచ్చు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • దరఖాస్తు చివరి తేదీ: 2024, డిసెంబర్‌ 31
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: 2025 జనవరి 1 నుంచి 7 వరకు
  • పరీక్ష తేదీ: 2025 ఏప్రిల్‌ 13
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: upsconline.gov.in
  • వివరాలకు వెబ్‌సైట్‌: www.upsc.gov.in

రాత పరీక్షలో రాణించేలా

  • పేపర్‌–1లో మంచి మార్కులు సాధించాలంటే..అల్జీబ్రా, మ్యాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్, అనలిటికల్‌ జామెట్రీ, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, వెక్టార్‌ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా  ప్రాక్టీస్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం కూడా మేలు చేస్తుంది. బేíసిక్‌ ప్రిన్సిపుల్స్, వివిధ సిద్ధాంతాలు, సూత్రాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • పేపర్‌–2లో విజయానికి బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్, వొకాబ్యులరీ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లనై పట్టు సాధించాలి. జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్, చరిత్ర–భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌లను క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు, ఆయా విభాగాలకు ఇచ్చిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • ఫిజిక్స్‌లో ఎలక్ట్రోమాగ్నటిజం, మెకానిక్స్, డైనమిక్స్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీలో కెమికల్‌ అనాలసిస్, ఇనార్గానిక్‌ కాంపౌండ్స్, పిరియాడిక్‌ టేబుల్స్, కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్, థర్మోడైనమిక్స్, క్వాంటమ్‌ మెకానిక్స్‌పై ప్రధానంగా దృష్టి సారించాలి. 
  • జనరల్‌ సైన్స్‌లో వ్యాధులు–కారకాలు, ప్లాంట్‌ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్‌ కింగ్‌ డమ్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌ కోసం పరీక్ష జరిగే తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన మార్పులపై దృష్టి సారించాలి. 
  • హిస్టరీ విభాగాలకు సంబంధించి స్వాతంత్రోద్యమ సంఘటనలు, రాజులు–రాజ్య వంశాలు, చారిత్రక కట్టడాలు, యుద్ధాల సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి. భౌగోళిక శాస్త్రానికి సంబంధించి ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది. 
Published date : 18 Dec 2024 10:49AM

Photo Stories