TS TET 2022 Results: జూన్ 27న ఫలితాలు విడుదల.. ఈ సారి అర్హత మార్కులు మాత్రం..?
![ts tet 2022 results release date](/sites/default/files/images/2022/06/13/eam12-1655114489.jpg)
పరీక్షకు 90 శాతం మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని టెట్ కన్వీనర్ రాధారెడ్డి మీడియాకు తెలిపారు. టెట్కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా, 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఈడీ అర్హతతో నిర్వహించిన టెట్ పేపర్–1కు మొత్తం 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, 3,18,506 మంది(90.62 శాతం) హాజరయ్యారు.32,976 మంది గైర్హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షకు బీఎడ్ అభ్యర్థులను కూడా అనుమతించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పేపర్–2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది హాజరయ్యారు. 26,830 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షాకేంద్రాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలను ఓపెన్ చేశామని అధికారులు వెల్లడించారు. టెట్ ఫలితాలను జూన్ 27న విడుదల చేస్తామని రాధారెడ్డి తెలిపారు. టీఎస్ టెట్-2022 ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com )లో చూడొచ్చు.