మల్దకల్: ఉన్నత లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్కు అడుగు పడుతుందని.. ప్రతిభ కనబర్చి అటు తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తేవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి హృదయరాజు అన్నారు.
ఉన్నత లక్ష్యంతో చదివితే భవిష్యత్
ఆగస్టు 10న మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జై నడిగడ్డ యువత ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సదరు యువకులు ప్రతిభ అవార్డులు అందజేసింది.