Skip to main content

TSBIE: ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఫలితా ల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. మొదటి, రెండో సంవత్సరం రెండింటిలోనూ బాలురను మించి ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు.
TSBIE
ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ తేదీలు ఇవే..

ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్‌ కావడం గమనార్హం. మే 9న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ రెండేళ్ల పరీక్షలు కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారని తెలిపారు. ఫస్టియర్‌లో 61.68 శాతం, సెకండియర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు. ఫస్టియర్‌లో 1,75,505 మంది, సెకండియర్‌లో 1,91,698 మంది ఏ గ్రేడ్‌ (75శాతంపైన మార్కులతో)లో ఉత్తీర్ణులైనట్టు వివరించారు. ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ (75% పాస్‌) మొదటి స్థానంలో, రంగారెడ్డి (73% పాస్‌) ద్వితీయ స్థానంలో నిలిచా యని మంత్రి తెలిపారు. సెకండియర్‌లో ములుగు (85% పాస్‌) మొదటి స్థానంలో, కొమురం భీం (81 శాతం పాస్‌) రెండో స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేశారు. 

☛ TS Inter 1st Year 2023 Results - General Vocational

☛ TS Inter 2nd Year 2023 Results - General Vocational

ఫెయిలైతే ఆందోళన పడొద్దు 

ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసి పాసవ్వాలని మంత్రి సూచించారు. ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదని, అందువల్ల ఇంటర్‌ మార్కులు తక్కువ వచ్చినా ఆందోళన పడొద్దని చెప్పారు. 

చదవండి:  TS Inter Short Memo 2023 Link : టీఎస్ ఇంటర్ మార్కుల మెమో వ‌చ్చాయ్‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

నేటి నుంచి రీవెరిఫికేషన్‌.. 

ఇంటర్‌ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్‌ ప్రక్రియను మే 10 నుంచి 16 వరకు చేపడుతున్నామని.. విద్యార్థులు సంబంధిత కాలేజీల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. రీవెరిఫికేషన్‌కు రూ.100, రీవ్యాల్యూయేషన్‌కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులతోపాటు పాసైనా ఇంప్రవ్‌మెంట్‌ కోరుకునే విద్యార్థులు మే 16 లోగా ఫీజు చెల్లించాలని సూచించారు. మార్కుల మెమోలు, కలర్‌ ప్రింట్లను ఇంటర్‌ బోర్డ్‌ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. మానసిక ఆందోళనకు గురైన విద్యార్థులు 14416 టోల్‌ ఫ్రీనంబర్‌కు కాల్‌ చేసి నిపుణుల ద్వారా కౌన్సిలింగ్‌ పొందవచ్చని తెలిపారు. వీలైనంత త్వరగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇంటర్‌ బోర్డ్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చే వరకు కూడా.. ఏ కాలేజీలోనూ అడ్మిషన్లు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు.  

చదవండి: TSBIE: ప్రైవేటు ప్రకటనలకు ఇంటర్‌ బోర్డ్‌ కట్టడి

ఇంటర్‌ ఫలితాల సరళి ఇదీ.. 

అంశం

ఫస్టియర్‌

సెకండియర్‌

పరీక్ష రాసిన అభ్యర్థులు

4,82,675

4,65,478

ఉత్తీర్ణులైన వారు

1,97,741

2,95,550

ఉత్తీర్ణత శాతం

61.68

63.49

పరీక్ష రాసిన బాలురు

2,41,002

2,35,520

ఉత్తీర్ణులైన బాలురు

1,31,747

1,30,952

బాలుర ఉత్తీర్ణత శాతం

54.66

55.60

పరీక్ష రాసిన బాలికలు

2,41,673

2,29,958

ఉత్తీర్ణులైన బాలికలు

1,65,994

1,64,598

బాలికల ఉత్తీర్ణత శాతం

68.68

71.57

ఎ గ్రేడ్‌ ఉత్తీర్ణులు (75% పైన)

1,75,505

1,91,698

బి గ్రేడ్‌ ఉత్తీర్ణులు (60–75%)

75,820

64,385

సి గ్రేడ్‌ ఉత్తీర్ణులు (50–60%)

31,659

21,166

డి గ్రేడ్‌ ఉత్తీర్ణులు (35–50%)

14,757

7,784

ఎంపీసీలో అత్యధిక ఉత్తీర్ణత.. రెండో స్థానంలో బైపీసీ – హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సుల్లో 50 శాతంలోపే పాస్‌
సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా సైన్స్‌ గ్రూపుల్లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండింటిలోనూ ఎంపీసీ (మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూపులో ఎక్కువ మంది పాసయ్యారు. తర్వాత స్థానంలో బైపీసీ ఉండగా.. సీఈసీ, హెచ్‌ఈసీ వంటి సంప్రదాయ గ్రూపుల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైంది.

ఇంటర్‌ గ్రూప్‌ల వారీగా ఉత్తీర్ణత తీరు..

 

ఫస్టియర్‌

సెకండియర్‌

గ్రూపు

పరీక్షరాసినది

ఉత్తీర్ణులు (శాతం)

పరీక్షరాసింది

ఉత్తీర్ణులు (శాతం)

ఎంపీసీ

2,07,752

1,57,773 (75.94%)

1,65,708

1,20,515 (72.73%)

బైపీసీ

1,00,336

64,358 (64.14%)

1,11,275

75,040 (67.44%)

సీఈసీ

98,600

37,449 (37.98%)

1,11,765

52,807 (47.25%)

హెఈసీ

11,298

3,408 (30.18%)

10,263

4,792 (46.69%)

ఎంఈసీ

14,674

8,927 (60.84%)

19,557

11,729 (59.97%)

తగ్గిన ఉత్తీర్ణత శాతం 

  • వంద శాతం సిలబస్‌ కారణమంటున్న నిపుణులు 
  • కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఉత్తీర్ణత ఎక్కువే 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటి ఫలితాలూ ఇలాగే ఉన్నాయి. కోవిడ్‌ కారణంగా 2021లో పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్‌ చేశారు. తర్వాత 2022లోనూ 75శాతం సిలబస్‌తో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది వంద శాతం సిలబస్‌తో పరీక్షలు పెట్టారు. పూర్తి సిలబస్‌ నేపథ్యంలోనే ఇంటర్‌ జనరల్‌ విభాగంలో ఉత్తీర్ణత స్వల్పంగా తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. అయితే 2019తో పోలిస్తే మాత్రం పాస్‌ పర్సంటేజీ ఎక్కువగానే ఉంది.

కొన్నేళ్లుగా ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం (శాతాల్లో)

ఏడాది

ఫస్టియర్‌

సెకండియర్‌

2018–19

60.60

64.94

2019–20

61.07

69.61

2020–21

100

100

2021–22

64.85

68.68

2022–23

62.85

67.27 

Published date : 10 May 2023 03:15PM

Photo Stories