Skip to main content

మట్టి కుండలో నీరు చల్లగా ఉంటుంది. ఎందుకు?

మన చేతిపై లేక మణికట్టుపై కొన్ని చుక్కలు సెంటు లేదా అత్తరు వేసుకుంటే చల్లగా, హాయిగా అనిపిస్తుంది. అందుకు కారణం ఆ చుక్కలు చేతి నుంచి ఉష్ణాన్ని గ్రహించి ఆవిరవడమే. ఈ ప్రక్రియను ‘భాష్పీభవనం’ అంటారు. అత్తరు చుక్కలు చేతిపై పడిన ప్రదేశంలో వేడి తగ్గిపోవడంతో చల్లదనం మన అనుభవంలోకి వస్తుంది. మన దేహానికి బాగా చెమట పట్టినపుడు ఫ్యాన్ కింద కూర్చుంటే కలిగే చల్లదనం కూడా ఇలాంటిదే. దేహంలో ఉండే ఉష్ణాన్ని చెమట బిందువులు గ్రహించి ఆవిరిగా మారతాయి. ఆ ఆవిరిని ఫ్యాను గాలి దూరంగా తీసుకుపోవడంతో దేహానికి చల్లదనం కలుగుతుంది.

మట్టి కుండలో నీరు చల్లగా ఉంటుంది. ఎందుకు

- లక్ష్మీ ఈమని

Published date : 06 Jan 2022 03:43PM

Photo Stories