Skip to main content

Education: విద్యారంగ పరిరక్షణకు పీఆర్‌టీయూ కృషి

లింగాలఘణపురం: విద్యారంగాన్ని పరిరక్షించేందు కు పీఆర్‌టీయూ కృషి చేస్తున్నదని రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు.
PRTUs efforts to protect the education sector
సభ్యత్వం అందజేస్తున్న శ్రీపాల్‌రెడ్డి

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆగ‌స్టు 2న‌ మోడల్‌స్కూ ల్‌, కస్తూర్బాగాంధీ, ఉన్నత పాఠశాలల్లో పర్యటించారు. ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం, సుదూర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన వారికి సీని యారిటీపై బదిలీలు, పదోన్నతుల కల్పనకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.

మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్బాగాంధీ ఉపాధ్యాయుల సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో జనగామ, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

విద్యార్థులకు ‘తొలిమెట్టు’ చాలా ముఖ్యం

New Exam Pattern: విద్యా ప్రమాణాలు పెరుగుతాయి

Published date : 03 Aug 2023 03:24PM

Photo Stories