Skip to main content

Sakshi: గిరిజన విద్యార్థినికి బంగారు పతకం

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని గిరి జన ఆదర్శ క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సాక్షి అనే విద్యార్థి జూనియర్‌ అథ్లెటిక్స్‌లో సత్తా చాటింది.
Gold medal for tribal student
సాక్షితో అధికారులు

జావెలిన్‌ త్రో విభాగంలో బంగారు పతకం సాధించినట్లు డీఎస్‌వో మీనారెడ్డి తెలిపారు. అక్టోబ‌ర్ 15 నుంచి 17 వరకు వరంగల్‌లో నిర్వహించిన జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో సాక్షి జావెలిన్‌ త్రో విభాగంలో ఈటెను 37.82 మీటర్ల దూరం విసిరి జాతీయస్థాయి రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. విద్యార్థిని అక్టోబ‌ర్ 17న‌ డీటీడీవో రమాదేవి, ఏసీఎంవో ఉద్దవ్‌, కోచ్‌ విద్యాసాగర్‌ అభినందించారు.

చదవండి:

DEO Vasanthi: ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో పాల్గొనాలి

Technical Education: సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్‌

Published date : 18 Oct 2023 04:12PM

Photo Stories