Skip to main content

Department of Education: ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ స్థాయి బోధన..

నేలకొండపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడమే కాక విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసాచారి వెల్లడించారు.
Nelakondapally State Education Director, Corporate Level Education, Corporate level teaching in government schools, Government School Facilitie,

 ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెంలో పలు పాఠశాలలను న‌వంబ‌ర్ 10న‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించడంతో పాటు తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. ఈ ఏడాది అనుకున్న సమయం కంటే ముందుగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించామని తెలిపారు.

చదవండి: Kambhampati Satyanarayana: నిరుద్యోగి వినూత్న ప్రచారం

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఈ ఏడాది 2.3 కోట్ల పుస్తకాలు సరఫరా చేశామని చెప్పారు. మెరుగైన ఫలితాలు నమోదయ్యేలా ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, విద్యార్థులు వంద శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బి.రాములు, హెచ్‌ఎం హరి శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Published date : 11 Nov 2023 02:45PM

Photo Stories