Skip to main content

Jobs: 22 వేల బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు

ఎట్టకేలకు విద్యాశాఖలోని ఖాళీ పోస్టుల లెక్క తేలింది. నియామకాలకు మార్గం సుగమమైంది.
teacher
22 వేల బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు

మంజూరైన బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య 1.31 లక్షలు కాగా, ప్రస్తుతం విధుల్లో ఉన్నవారి సంఖ్య 1.09 లక్షలు. అంటే ఇంకా 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇందులో ప్రధానమైనవి ఉపాధ్యాయపోస్టులే. ఇంతకాలం టీచర్‌ పోస్టుల లెక్క కచ్చితంగా లేక పోవడం, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత విభజన జరగకపోవడంతో విద్యాబోధనలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని స్కూళ్లల్లో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు కూడా లేరు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్‌ సెలవు పెడితే ఇక అంతే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్‌ విధానంలో భాగంగా జిల్లాస్థాయి ప్రభుత్వ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించేం దుకు విధివిధానాలు వెల్లడించింది. దీంతో టీచర్ల స్థానికత కూడా తేలిపోతుంది. అప్పుడు ఏ జిల్లాకు ఎంతమంది ఉపాధ్యాయులనేది ఖచ్చితంగా లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న టీచర్‌పోస్టుల భర్తీ ప్రక్రియ ఎలా చేపడతారనేది విద్యాశాఖలో చర్చనీ యాంశమైంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.

విభజనతోనే ముగింపు:

విద్యాశాఖ అధికారులు గత కొన్ని నెలలుగా కొత్త జిల్లాలవారీగా టీచర్ల విభజనపైనే దృష్టిపెట్టారు. కేడర్, సబ్జెక్టు, మీడియంవారీగా క్షేత్రస్థాయిలో విభజన చేపట్టారు. ఈ లెక్కన మొత్తం 351 కేడర్లు ఉన్నట్టు పాఠశాల విద్య ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దాదాపు 575 మండలాలకు ఎంఈవోలు, 22 జిల్లాలకు డీఈ వోలు, 63 చోట్ల ఉప విద్యాధికారులను నియమిం చాల్సి ఉంది. టీచింగ్‌ స్టాఫ్‌ విషయానికొస్తే మంజూ రైన పోస్టుల్లోనే 1,970 గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్లు, 8,151 మంది అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయుల పోస్టులు, 1,971 ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 6,011 సెకెండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల భర్తీ అవసరం. వీరితోపాటు 309 మంది భాషాపండితులు (అప్‌గ్రేడ్‌ చేసే ఈ సంఖ్య 10 వేలవరకూ ఉండొచ్చు), పీఈటీలు 60 మంది, క్రాఫ్ట్‌ టీచర్లు 450 మందిని తీసుకోవాలి. ఇవన్నీ కేవలం మంజూరైన పోస్టుల్లో ఏర్పడ్డ ఖాళీలే. ప్రతి స్కూల్‌కు అటెండర్, స్కావెంజర్స్, రికార్డు అసిస్టెంట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. వీటిని కొత్తగా మంజూరు చేస్తే పెద్దఎత్తున నియామకాలు చేపట్టాలి.

అంత అవసరం లేదా?

విద్యాశాఖలోని ఖాళీలను ఇప్పటికిప్పుడు భర్తీ చేసే అవకాశం కన్పించడం లేదు. తాజాగా ఆ శాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఇందుకు అనుగుణంగానే సిఫారసులు చేసినట్టు తెలిసింది. జిల్లాలవారీ టీచర్ల విభజన జరిగితే ముందుగా సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ)ల అవసరమే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో భారీగా ఖాళీలుంటాయని, ఇప్పటిలాగా అప్పుడు సర్దుబాటు సాధ్యం కాదంటున్నారు. ఈ కారణంగా ఎస్‌జీటీలను వందశాతం భర్తీ చేయడమే సరైన నిర్ణయమని సిఫారసు చేసింది. అదీగాక ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించవచ్చని పేర్కొంది. అయితే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ విషయంలో అస్పష్టత నెలకొంది. ఈ పోస్టులను 30 శాతమే భర్తీ చేయాలని విద్యాశాఖ చెబుతోంది. పదోన్నతుల ద్వారా వచ్చే ఎస్‌జీటీలతో మిగతా పోస్టుల భర్తీ ఎలాగో తెలియట్లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. జిల్లా స్థాయి కేడర్‌ విభజన తర్వాత వలంటీర్లను తీసుకునే వీలు ఉందంటున్నారు. అయితే విభజనతోపాటు బదిలీలు, పదోన్నతులు త్వరగా కల్పించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య కోరారు.

చదవండి: 

KGBV: పోస్టుల భర్తీకి పక్కా రూల్స్‌

958 Jobs: కేజీబీవీల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌.. వాటి వివరాలు

Good News: స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆమోదం

Teachers: సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

Published date : 07 Dec 2021 04:16PM

Photo Stories