Skip to main content

TET: భాషా పండితుల కోసం టెట్‌లో ఈ పేపర్‌ని పరిశీలిస్తున్నాం

టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో భాషా పండితుల కోసం పేపర్‌–3ని పరిశీలిస్తున్నామని తేలంగాణ విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి చెప్పారు.
We Are Examining Paper Three in TET for Language Pandit Scholars
విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి

మార్చి 30న వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండల పరిధిలోని నాందార్‌పూర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. టెట్‌లో ఇదివరకు తెలుగు పండితులకు సోషల్‌ పేపర్‌–2 నిర్వహించేవారని, ప్రస్తుత టెట్‌లో తెలుగు పండితులు, ఇతర భాషా పండితులకు పేపర్‌ నిర్వహించాలని మంత్రిని నిరుద్యోగుల సంఘం నాయకులు మాసని వెంకటయ్య, లాలయ్య, పలువురు కోరారు. దీనిపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని.. త్వరలో నిర్ణయం తీసు కుంటామని మంత్రి చెప్పారు.

Sakshi Education Mobile App
Published date : 31 Mar 2022 03:54PM

Photo Stories