సాక్షి, అమరావతి: హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, ఓవర్సీర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, అసిస్టెంట్ ఓవర్సీర్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 23లోపు వెల్లడిస్తామని రిజిస్ట్రార్ (అడ్మిన్) ఎ.గిరిధర్ ఫిబ్రవరి 13న ఒక ప్రకటనలో తెలిపారు.
హైకోర్టులో ఉద్యోగాల పరీక్షల ఫలితాలు వివరాలు
వాస్తవానికి నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరి 13నే పరీక్షా ఫలితాలను వెల్లడించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 241 పోస్టుల భర్తీకి 2022 అక్టోబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.