టీజీటీ నుంచి పీజీటీలుగా పదోన్నతులను కల్పించేందుకు జాబితాను తయారు చేసినట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించిన విధంగా పాఠశాలకు హజరు కావాలని వెల్లడించారు.
Teachers promoted as Post Graduate Teachers
సాక్షి ఎడ్యుకేషన్: జోన్–4 పరిధిలోని మోడల్ స్కూళ్ల టీజీటీలకు పీజీటీలుగా పదోన్నతులు కల్పించేందుకు ఫైనల్ సీనియార్టీ జాబితాను సిద్ధం చేసి డీఈఓ కార్యాలయాల్లో ఉంచినట్లు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎం.వెంకటకృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జాబితా మేరకు సంబంధిత టీజీటీలు సర్వీస్ రిజిష్టర్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, మూడేళ్ల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ (ఏసీఆర్) తీసుకుని ఈ నెల 12న కడప గాంధీనగర్లోని మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో హాజరు కావాలని సూచించారు.