విభిన్న స్థాయిలో పోటీలు నిర్వహించాలని జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి నర్సింహారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎటువంటి తేదీల్లో జరగబోతున్నాయని కూడా స్పష్టం చేశారు.
sports competitions for schools
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాస్థాయి పాఠశాల క్రీడాపోటీల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈమేరకు జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి నర్సింహారెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. మండల స్థాయిలో సెప్టెంబర్ 7వ తేదీ లోపు, జోనల్ స్థాయిలో 20లోగా, జిల్లాస్థాయి పోటీలు చివరి వారం వరకు నిర్వహించాలని సూచించారు.
మండల స్థాయిలో ఎంఈఓల పర్యవేక్షణలో హెచ్ఎంలు, పీఈటీ, పీడీలు సమావేశమై తేదీలు ఖరారు చేయాలని తెలిపారు. ఇదే సమావేశంలో జోనల్ క్రీడా కార్యదర్శిని కూడా నియమించాలని చెప్పారు. కాగా, ఇప్పటికే నలుగురితో జిల్లా స్థాయి కమిటీని నియమించగా, మరో నలుగురిని తీసుకుంటామని తెలిపారు. కానీ పోటీల తేదీలు ఖరారైనా కొత్త వారిని నియమించకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.