Navodaya Admissions : నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ!
Sakshi Education
మదనపల్లె: స్థానిక చిత్తూరు రోడ్డులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంచినట్లు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ గోవిందరావు తెలిపారు. విద్యార్థులు ఈనెల 23లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థి, తల్లిదండ్రులు ఉమ్మడి చిత్తూరు జిల్లా వారు అయి ఉండాలన్నారు.
Govt Medical UG College : ప్రభుత్వ వైద్య కళాశాలలో పెరిగిన యూజీ సీట్లు..
విద్యార్థులు 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదువుతూ 1.5.2013 నుంచి 31.7.2015 మధ్య జన్మించి ఉండాలన్నారు. 3,4 తరగతులు చదివిన పాఠశాల, 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల అయి ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Published date : 18 Sep 2024 04:08PM